Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్క్రీన్‌‌ను బద్దలు కొట్టుకొని సింహం బయటికి వస్తే..?

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (10:21 IST)
Lion
సాంకేతికత పరంగా ప్రపంచం దూసుకుపోతోంది. నమ్మలేని విషయాలను కళ్ల ముందుకు తెస్తోంది. అలాంటిదే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా చైనా, ఉత్తరకొరియా రోడ్లపై ఏర్పాటు చేసిన స్క్రీన్లను చూసి అక్కడి వారు నిత్యం ఆశ్చర్యపోతున్నారు.

చైనాలోని చెంగ్డూలో ఏర్పాటు చేసిన ఓ 3డీ డిస్​ప్లేను చూసిన మహిళ పరుగులు పెట్టింది. హఠాత్తుగా స్కీన్ లోపల ఉన్న సింహం బయటకు వచ్చినట్టు అనిపించింది. చూసేందుకు ఆ 3డీ వీడియో అలానే ఉంది. స్క్రీన్‌‌ను బద్దలు కొట్టుకొని సింహం బయటికి వచ్చినట్టు అనిపించడంతో ఆమె పరుగెత్తింది. ఈ వీడియో వైరల్​గా మారింది.
 
ఇక గువాన్​యిన్​క్వియాలో ఏర్పాటు చేసిన స్క్రీన్లలో ప్రదర్శించిన ఫ్లయింగ్ సాసర్​ 3డీ వీడియోలు సైతం అబ్బురపరుస్తున్నాయి. రైలు, విమానాలు ఇలా ఆ డిస్​ప్లేల్లో కనిపించే ప్రతి ఒక్కటి తమ మధ్యలోకి వస్తున్నాయేమో అన్నట్టు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా కళ్లకు ఎలాంటి ప్రత్యేకమైన అద్దాలు లేకుండా ఈ త్రీడీ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తుండడం ప్రత్యేకత. ఇలాగే 2020లో సౌత్ కొరియాలో ఏర్పాటు చేసిన ఓ 3డీ డిస్​ప్లే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. 
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments