Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికార పార్టీకి చెందిన ఎంపీ.. ఎమ్మెల్యే బూట్లతో కొట్టుకున్నారండోయ్..

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (12:03 IST)
సాధారణంగా రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం మామూలే. అయితే తాజాగా ఎంపీ, ఎమ్మెల్యేలు ఒకరినొకరు బూట్లతో చితక్కొట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ సమావేశంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు బూట్లతో కొట్టుకున్నారు. అది కూడా ఒక ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే. వీరిద్దరూ అధికార పార్టీకి చెందిన వారే కావడం విశేషం. 
 
భారతీయ జనతాపార్టీకి చెందిన వీరిద్దరూ ఒకరిపై ఒకరు బూట్ల దాడికి దిగారు. ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. యూపీ మంత్రి అశుతోష్ టండన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో కబీర్ నగర్ ఎంపీ శరద్ త్రిపాఠీ, మెహదావల్ ఎమ్మెల్యే రాకేశ్ సిన్హ్ మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునేంత వరకు వెళ్లింది. 
 
కోపంతో ఊగిపోయిన ఎంపీ ఎమ్మెల్యేను బూటుతో చిటక్కొట్టారు. బాధ్యుతాయుతంగా ప్రవర్తించాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా ఒకరిపై ఒకరు దాడులకు దిగుతుంటే, ప్రజలను ఎలా రక్షిస్తారు అని ఇతర పార్టీల నాయకులు వాపోతున్నారు. వీరిద్దరిపై వేటు పడాల్సిందే అంటూ అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజాప్రతినిధులే ప్రత్యక్షంగా దాడులకు దిగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments