Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పాతివ్రత్యం.. సలసల కాగే నూనెలో ఐదు రూపాయల కాయిన్ వేసి..?

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (22:20 IST)
Oil
భార్య పాతివ్రత్యం పరీక్షించేందుకు దుర్మార్గపు చర్యకు పాల్పడ్డాడు ఓ భర్త. ఆమెకు అగ్నీ పరీక్ష పెట్టాడు. సలసల కాగే నూనెలో చేతులు పెట్టించి.. అందులో ఉంచిన రూ. 5 నాణెం తీయించాడు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బాధిత మహిళకు ఫిబ్రవరి 11న తన భర్తతో గొడవ జరిగింది. దీంతో ఆమె ఎవరికి చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయింది. డ్రైవర్‌గా పనిచేసే ఆ మహిళ భర్త నాలుగు రోజులుగా కారులో తిరుగుతూ ఆమె గురించి వెతుకుతూనే ఉన్నాడు. అయితే నాలుగు రోజుల తర్వాత ఆ మహిళ ఇంటికి చేరింది. దీంతో భర్త ఆమెను ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించాడు. దీంతో ఆమె జరిగిన విషయం అతనికి చెప్పింది.
 
పరాండాలోని ఖాచపురి చౌక్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తనను బలవంతంగా తీసుకెళ్లారని తెలిపింది. ఆ వ్యక్తులు నాలుగు రోజులుగా బంధీగా ఉంచారని పేర్కొంది. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరినట్టు చెప్పింది. 
 
అయితే మహిళ చెప్పిన మాటలు వినిపించుకుని భర్త.. ఇంటికి తిరిగివచ్చిన దీంతో వారి సంప్రదాయం(పర్ది) ప్రకారం భార్య పాతివ్రత్యాన్ని పరీక్షించాలని నిర్ణయించాడు. ఈ మేరకు సలసల కాగే నూనెలో ఐదు రూపాయల బిళ్ల వేసి దాన్ని చేతితో తీయాలని పరీక్ష పెట్టాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments