డెలివరీ బాయ్‌‌కి చెంపదెబ్బలు.. పోలీస్ అరెస్ట్.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (16:07 IST)
Traffic police
కోవై ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్‌ను చెంపదెబ్బలు కొట్టినందుకు ఓ పోలీస్ అరెస్ట్ కావడంతో పాటు అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 38 ఏళ్ల బాధితుడు మోహన్ సుందరం రెండేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు.
 
రోజూలాగే తన విధుల్లో భాగంగా అవినాశి రోడ్డులో శుక్రవారం బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. అయితే ఈ సమయంలో ఓ స్కూల్ వ్యాన్ వేగంగా వచ్చి వచ్చింది. 
 
రెండు వాహనాలను, పాదచారులను ఢీకొట్టి వెళ్లింది. దీనిని గమనించిన మోహన్ సుందరం ఆ వ్యాన్ ఆపేందుకు ప్రయత్నించాడు. చివరికి దానిని ఆపాడు. అయితే ఈ క్రమంలో అవినాశి రోడ్డు జంక్షన్ లో స్పల్ప ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
 
దీంతో అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సింగనల్లూర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ అక్కడికి చేరుకున్నాడు. ట్రాఫిక్ జామ్ కారణమైన ఫుడ్ డెలివరీ బాయ్‌ను చెంప దెబ్బలు కొట్టాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. 
 
ఫుడ్ డెలివరీ బాయ్‌ను కానిస్టేబుల్ కొడుతున్న దృశ్యాలన్నీ దాంట్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో విడుదల కావడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. అందరూ ఆ ఫుడ్ డెలివరీ బాయ్ పట్ల సానుభూతి ప్రకటించారు.
 
నెటిజన్లు ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. ఇదే సమయంలో బాధితుడైన మోహన సుందరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కానిస్టేబుల్ సతీష్‌‌పై కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అతడిని విధుల నుంచి తొలగించి, అరెస్టు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments