రైలు ఇంజిన్ కింద కూర్చుని 200 కి.మీ ప్రయాణం, చూసినవారంతా షాక్, తేరుకునేలోపే పరార్

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (16:37 IST)
రైలు పట్టాలపై రైలు ఇంజిన్ వస్తుందంటేనే అంతదూరం పరుగుపెడతారు. అలాంటిది రైలు ఇంజిన్ కింద భాగంలో కూర్చుని ఓ యువకుడు ఏకంగా 200 కి.మీ ప్రయాణం చేసాడు. ఈ షాకింగ్ ఘటన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.


పాట్నా మీదుగా రాజ్‌గిర్ నుంచి వస్తున్న బుద్ధ పూర్ణిమ ఎక్స్‌ప్రెస్ మరికొద్దిసేపట్లో గయా జంక్షన్ వద్ద ఆగబోతోంది. ఇంతలో రైలు ఇంజిన్ నుంచి నుంచి పెద్దపెద్ద ఏడుపులు, కేకలు వినిపించాయి. అవి ఎటు నుంచి వస్తున్నాయో అర్థంకాలేదు.

 
ఇంతలో రైలు గయా స్టేషను వద్దకు చేరుకోగానే... డ్రైవర్ రైలు దిగి అటుఇటూ చూసాడు. ఐతే రైలు ఇంజిన్ కింద నుంచి ఏడుపులు, మంచినీళ్లు కావాలంటూ కేకలు వినిపించాయి. రైలు కింద చూస్తే ఓ వ్యక్తి కనిపించాడు. అతడిని చూసి అక్కడున్నవారంతా షాక్ తిన్నారు. మెల్లగా అతడిని రైలు ఇంజిన్ కింద నుంచి బయటకు లాగారు. రైలు డ్రైవర్ స్థానిక పోలీసు అధికారులకు విషయాన్ని చెప్పాడు.

 
ఐతే వారు వచ్చేలోపుగానే ఇతడు పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నారు. ఐతే రైలు ఇంజిన్ కింది భాగం విపరీతమైన వేడితో పాటు, వేగానికి కింద జారిపడిపోయే అవకాశం కూడా వుంది. అలాంటిది సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణాన్ని అతడు ఎలా చేసాడా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments