Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహం జరిగి 14 రోజులైంది... పెళ్లి చేసిన అర్చకుడితో కొత్త పెళ్లికూతురు జంప్..

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (13:20 IST)
వివాహం జరిగి 14 రోజులైంది. అంతే పెళ్లి చేసిపెట్టిన అర్చకుడితో కొత్తపెళ్లి కూతురు పరారైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, అజాద్ అనే గ్రామంలో గత ఏడో తేదీన ఓ జంటకు వివాహం జరిగింది. ఈ వివాహానికి ఆ ప్రాంతానికి చెందిన ఓ ఆలయ అర్చకుడు వినోద్ మహారాజ్ పండితుడిగా హాజరై.. పెళ్ళితంతును పూర్తి చేశాడు. 
 
అయితే వివాహం జరిగిన 16వ రోజున వున్నట్టుండి కొత్త పెళ్లి కూతురు అదృశ్యమైంది. కొత్త పెళ్లి కూతురు కనబడట్లేదని ఆ ఊరంతా తెలిసిపోయింది. అదే సమయంలో ఆ ఊరి ఆలయ అర్చకుడు కూడా మాయమయ్యాడు. ఇకపోతే.. కొత్త పెళ్లి కూతురు వెళ్తూ వెళ్తూ ఒకటిన్నర లక్ష రూపాయల విలువగల బంగారం, 30వేల రూపాయల నగదు తీసుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. అర్చకుడితో కొత్త పెళ్లికూతురికి పెళ్లికి ముందు నుంచే తెలుసునని.. పెళ్లికి ముందే అతనితో చెట్టాపట్టాలేసుకుని ఆమె తిరిగేదని తెలిసింది. ఇక అర్చకుడికి ఇప్పటికే వివాహం జరిగిందని, ఇద్దరు సంతానం కూడా వున్నారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments