Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 1100 రైళ్లు రద్దు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 5 మే 2022 (11:28 IST)
దేశ వ్యాప్తంగా దాదాపు 1100 రైళ్లను భారతీయ రైల్వే శాఖ రద్దుచేసింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం క్రమక్రమంగా పెరుగుతుంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా, నేలబొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. దీనికితోడు వేసవి ఎండల తీవ్రత నానాటికీ పెరిగిపోతోంది. దీంతో కరెంట్ డిమాండ్ నానాటికీ పెరిగిపోతోంది. బొగ్గు ఉత్పత్తిలో కొరత ఏర్పడంతో విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా సాగడం లేదు. దీంతో ఇండియన్ రైల్వే ఈ సంక్షోభంపై దృష్టిసారించింది. 
 
విద్యుత్ కేంద్రాలకు త్వరితగతిన బొగ్గును తరలించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం గూడ్సు రైళ్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, భారీగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 1100 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. 
 
ఇప్పటికే అనేక రైళ్లు ఉన్నాయి. వీటిలో 500 ట్రిప్పుల ఎక్స్‌ప్రెస్ మెయిల్ రైళ్లు, 580 ట్రిప్పుల ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఏప్రిల్ 29వ తేదీన బొగ్గు రైళ్ళను నడిపేందుకు వీలుగా ఏకంగా 240 ప్యాసింజర్ ట్రైన్స్‌ను రైల్వే శాఖ రద్దుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం