Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ ఎన్నికల అస్త్రం : ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (16:03 IST)
వచ్చే నెలలో లోక్‌సభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదేశంలో ఆర్థికంగా వెనుకబడిన బలహీనవర్గాల వారికి విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. 
 
ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్లతో పాటు.. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 
 
అయితే, ఈ బిల్లుకు లోక్‌సభలో అడ్డంకి లేకపోవచ్చుగానీ రాజ్యసభలో మాత్రం ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అదేసమయంలో పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ప్రధాని మోడీ చేసిన ప్రకటనకు ఇపుడు ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ రిజర్వేషన్లు వర్తించాలంటే వార్షిక ఆదాయం రూ.8 లక్షలుగా ఉండాలి. వ్యవసాయ భూమి 5 హెక్టార్ల కంటే తక్కువగా ఉండాల. నివసించే ఇల్లు వెయ్యి చదరపుటడుగుల కంటే తక్కువగా ఉండాలి, మున్సిపాలిటీయేతర ప్రాంతంలో అయితే నివాస భూమి 209 చదరపు గజాల కంటే తక్కువగా ఉండాలన్న షరతులు విధించింది. ఈ రిజర్వేషన్లు కులంతో నిమిత్తం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన బీసీలందరికీ వర్తించనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments