Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవేంకటేశుని పాదాల నుంచి వచ్చే తీర్థం...

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (22:19 IST)
పూర్వం తుంగభద్రనదీ తీర్థంలో పద్మనాభునిపుత్రుడైన కేశవుడనే బ్రాహ్మణ యువకుడు వేశ్యాలంపటుడయ్యాడు. ధనం మీద దురాశతో ఒక విప్రుని చంపాడు. ఆ మరుక్షణమే బ్రహ్మహత్యాపాపం భయంకర రూపంతో అతని వెంట పడింది. కేశవుడు భయంతో దేశాలన్నీ తిరుగుతూ, తన తండ్రి కాళ్లపై పడి రక్షించమని ప్రార్థించాడు. 
 
అదే సమయానికి అక్కడికి వచ్చిన భరద్వాజ మహర్షి కటహ తీర్థమహిమను తెలియజేసి, ఆ తీర్థాన్ని సేవింపజేయమని ఆనతిచ్చాడు. కేశవ వర్మ తండ్రితో కూడా కూడా తిరుమల క్షేత్రాన్ని చేరుకుని శ్రీస్వామివారి కోనేట్లో స్నానమాచరించాడు. తరువాత వరాహస్వామిని దర్శించుకున్నాడు. 
 
అటు తర్వాత శ్రీవేంకటేశ్వరుని దర్శించి, పిదప శ్రీ స్వామివారి పాదాల నుండి స్రవించే కటాహతీర్థాన్ని స్వీకరించి బ్రహ్మహత్యాది మహాపాపాలను తొలగించుకున్నాడు. అలాగే కర్మరోగాలను కూడా పోగొట్టుకున్నాడు. ఈ కటాహతీర్థ జలాన్ని ఎవరైనా పానం చేయవచ్చుని, స్పర్శదోషం లేని ఆ తీర్థం, బ్రహ్మహత్యాది మహాపాపాలను తొలగించడమే కాకుండా, కర్మరోగాలైన భయంకర వ్యాధులను కూడా పోగొడుతుందని స్కందపురాణంలో చెప్పబడింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments