Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నేను విన్నాను.. నేనున్నాను'.. భరోసానిచ్చే "యాత్ర" టీజర్ అదిరింది

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:11 IST)
దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "యాత్ర". మహి వి. రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో అంటే వైఎస్ఆర్‌గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. 
 
పాదయాత్ర సమయంలో రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించాడు అన్నది ఈ సినిమా కథ. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. 
 
ఈ టీజర్‌లో రైతులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టేలా చూపించారు. "పంటపండించే రైతుకు సరైన సమయానికి వర్షాలు పడవు.. కరెంట్ ఉండదు.. అన్ని ఉంటె గిట్టుబాటు ధర ఉండదు అనే రైతే రాజు అంటారు.. రాజుగా కాదు కనీసం రైతును రైతుగా గుర్తిస్తే చాలు" అనే డైలాగ్స్  టీజర్ సాగుతుంది. 
 
దీనికి ప్రతిగా "నేను విన్నాను.. నేనున్నాను" అనే డైలాగ్‌తో టీజర్ ఎండ్ అవుతుంది. రైతు చుట్టూనే ఈ సినిమా నడుస్తుందని ఇట్టే తెలిసిపోతుంది. మహి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పొచ్చు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన రష్యా.. మాస్కోలో కొత్త ఆఫ్ఘన్ రాయబారి...

లండన్‌లో జల్సాలు - పార్టీలో పాటలు పాడిన విజయ్ మాల్యా - లలిత్ మోడీ!

కోల్‌కతా న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో విస్తుపోయే నిజాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments