Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నేను విన్నాను.. నేనున్నాను'.. భరోసానిచ్చే "యాత్ర" టీజర్ అదిరింది

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:11 IST)
దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "యాత్ర". మహి వి. రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో అంటే వైఎస్ఆర్‌గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. 
 
పాదయాత్ర సమయంలో రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించాడు అన్నది ఈ సినిమా కథ. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. 
 
ఈ టీజర్‌లో రైతులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టేలా చూపించారు. "పంటపండించే రైతుకు సరైన సమయానికి వర్షాలు పడవు.. కరెంట్ ఉండదు.. అన్ని ఉంటె గిట్టుబాటు ధర ఉండదు అనే రైతే రాజు అంటారు.. రాజుగా కాదు కనీసం రైతును రైతుగా గుర్తిస్తే చాలు" అనే డైలాగ్స్  టీజర్ సాగుతుంది. 
 
దీనికి ప్రతిగా "నేను విన్నాను.. నేనున్నాను" అనే డైలాగ్‌తో టీజర్ ఎండ్ అవుతుంది. రైతు చుట్టూనే ఈ సినిమా నడుస్తుందని ఇట్టే తెలిసిపోతుంది. మహి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పొచ్చు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments