"లవ్ స్టోరీ" నుంచి 'ఏవో ఏవో కలలే'... మహేష్ చేతుల మీదుగా రిలీజ్ (Video)

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (18:47 IST)
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం "లవ్‌స్టోరీ". ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే 'సారంగదరియా' అనే పాటను రిలీజ్ చేయగా అది సంచలనాలు సృష్టిస్తోంది. పైగా, ఓ వివాదం కూడా చెలరేగింది. ఇది టీ కప్పులో తుఫానులా సమసిపోయింది. 
 
ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాట రిలీజైంది. 'ఏవో ఏవో కలలే' అనే గీతాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. 'ఏవో ఏవో కలలే' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని మహేశ్ బాబు పేర్కొన్నారు. 
 
నిర్మాత నారాయణ దాస్ నారంగ్‌తో పాటు యావత్ చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. 'ఏవో ఏవో కలలే' గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. పవన్ సీహెచ్ సంగీత దర్శకుడు. సున్నితమైన ప్రేమకథా చిత్రంగా వస్తున్న 'లవ్ స్టోరీ' ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా నుంచి ఇంతకుముందు రిలీజైన 'సారంగ దరియా' గీతం విశేషరీతిలో ప్రజాదరణ పొందింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన ప్రమాదం తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments