Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను స్లో అయ్యనా?: రామ్ గోపాల్ వర్మ కొత్త సందేహం

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (16:14 IST)
అనుశ్రీ సమర్పణలో ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ & జేకే క్రియేషన్స్ బ్యానర్ లో జీడీ.కాశీo నిర్మాతగా జేడీ.చక్రవర్తి, జెనర్జీ, అక్షత, మనోజ్ నందన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఎంఎంఓఎఫ్.

ఈ చిత్ర ట్రైలర్ కార్యక్రమం హైదరాబాద్ లో సోమవారం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...ఎంఎంఓఎఫ్ ట్రైలర్ చూశాక నేను స్లో అయ్యనా సినిమా తీసిన వారు ఫాస్ట్ గా ఉన్నారా అనే అనుమానం కలిగింది. ఈ సినిమా ట్రైలర్ చాలా కొత్తగా ఉంది, ఆడియన్స్ కు సినిమా చూడాలి అనిపించేలా ఉంది.

ఈ సినిమా యూనిట్ సభ్యులు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. జేడీ చక్రవర్తి ఇలాంటి కొత్త కాన్సెప్ట్ మూవీస్ మరెన్నో చెయ్యలని కోరుకుంటున్న అన్నారు. 
 
నటుడు బెనర్జీ మాట్లాడుతూ...జేడీ కాల్ చేసి ఈ సినిమా చెయ్యమని అడిగారు, మంచి పాత్ర,  కథ కథనాలు బాగున్నాయని సినిమా చేశాను. జేడీతో చాలా కాలం తరువాత కలిసి నటించాను.

ఈ సినిమా ట్రైలర్ ఆర్జీవి చేతుల మీద విడుదల అవ్వడం సంతోషం. ఆర్జీవితో నాకు ఎంతో కాలం నుండి పరిచయం ఉంది, దాదాపు ఆయన అన్ని సినిమాల్లో నటించాను.

తెలుగు సినిమాకు డిఫరెంట్ మేకింగ్ ను పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ఎంఎంఓఎఫ్ సినిమా కొత్త కాన్సెప్ట్ తో వస్తోంది, ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుందని భవిస్తూ సెలవు తీసుకుంటున్నాను అన్నారు. 
 
హీరో మనోజ్ నందం మాట్లాడుతూ...మా సినిమా ట్రైలర్ ఆర్జీవి గారు విడుదల చెయ్యడం గుడ్ సైన్. ఈ సినిమాలో జేడీ గారితో నటించడం మర్చిపోలేని అనుభూతి. ఈ సినిమాలో ఒక కొత్త తరహా పాత్రతో మీ ముందుకు వస్తున్నాను. మా ఎంఎంఓఎఫ్ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని తెలిపారు.
 
శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ...వర్మ లా సినిమాలు చెయ్యాలని అతన్ని అనుకరించాలని చాలా మంది అనుకుంటారు కానీ అది అసాధ్యం. జీడీ చక్రవర్తి మేధాసంపత్తు ఉన్న నటుడు, ఎంఎంఓఎఫ్ ట్రైలర్ కొత్తగా ఉంది, ఆసక్తిని కలిగించింది. త్వరగా సినిమా చూడాలని అనిపిస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments