Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

సెల్వి
గురువారం, 2 అక్టోబరు 2025 (19:29 IST)
2022లో విడుదలై భారీ విజయం సొంతం చేసుకుని, నేషనల్‌ అవార్దు దక్కించుకున్న కాంతారకు ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్‌ 1 రూపొందింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయి భారీ విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా దసరా సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాంతారా చాప్టర్ 1. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతార చాప్టర్‌ 1 తెరకెక్కింది. 
 
ఈ చిత్రంపై పాజిటివ్ రివ్యూ, కామెంట్స్ వచ్చేశాయి. తాజాగా కాంతారాపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ ద్వారా తన రివ్యూను పోస్టు చేశారు. కాంతారా చాప్టర్ 1 టీమ్‌ను అభినందించారు. 
 
రిషబ్‌శెట్టి తన ఆలోచనలతో నటుడిగా, దర్శకుడిగా ఊహకందని అద్భుతాన్ని వెండితెరపై చూపెట్టాడని.. ఆయన నమ్మకంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిన హోంబలే ఫిల్మ్స్‌, చిత్ర బృందానికి శుభాకాంక్షలు.. అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాంతార చాప్టర్‌ 1 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన తారక్‌ కాంతారను ఈ స్థాయిలో తెరకెక్కించడం రిషబ్‌కు మాత్రమే సాధ్యమని కొనియాడిన సంగతి తెలిసిందే. 
 
కాంతార చాప్టర్‌ 1 సినిమా రిలీజ్‌కు తర్వాత పలువురు సెలెబ్రిటీలు, అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలాగే రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1ను తెరపై చూసి.. షో ముగిశాక కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సినిమాను రిషబ్ అద్భుతంగా తెరకెక్కించారు. ఆ ఫలితాన్ని వెండితెరపై చూశాక ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అదేవిధంగా తారక్, రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఓ శివాలయాన్ని సందర్శించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను తారక్ ఫ్యాన్స్, రిషబ్ ఫ్యాన్స్ భారీగా షేర్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments