Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు-తెలుగు విద్యార్థులకు చేయూతినివ్వండి

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (18:05 IST)
కృష్ణాజిల్లా విజయవాడ పి.బి సిద్ధార్థ కళాశాలలో డిసెంబర్ 27,28,29వ తేదీల్లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లాకు సంబంధించిన 67 మంది కవులు, రచయితలకు ఆహ్వాన పత్రికలు పంపిన సమాచారాన్ని ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గుత్తి కొండ సుబ్బారావు, డా.జి.వి.పూర్ణచందులు తెలిపినట్లు "కళామిత్ర మండలి తెలుగు లోగిలి" జాతీయ సంస్థ అధ్యక్షులు డా.నూనె అంకమ్మరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విజయవాడలో జరుగుతున్న"ప్రపంచ తెలుగు రచయితల మహాసభల"లో భాగంగా సురవరం ప్రతాపరెడ్డి వేదికపై కళామిత్ర మండలి తెలుగు లోగిలి జాతీయ అధ్యక్షులు డా.నూనె అంకమ్మరావు ప్రసంగిస్తూ నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషల ఔన్నత్యాన్ని చాటే విధంగా భాషలను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
 
తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు చేయూత నందిస్తూ తగిన ప్రోత్సాహకాలను ఏర్పాటు చేయాలని, నవతరానికి ఉపయోగపడే పాఠ్యాంశాల రూపకల్పన జరగాలని, గ్రంథాలయ వ్యవస్థను పరిపుష్టం చేయడానికి సన్నాహాలు చేపట్టాలని, నైతిక విలువలను తెలిపే విషయాలను బోధించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments