Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వం తరపున తెలుగు భాషా ఉత్సవాలను నిర్వహించాలి.. డాక్టర్ నూనె అంకమ్మ రావు

సెల్వి
గురువారం, 29 ఆగస్టు 2024 (11:55 IST)
Telugu Language Day
వ్యావహారిక భాషా పితామహుడు, పండితుల భాషను ప్రజల భాషగా మలచిన మహానుభావుడు అయిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం అని కళామిత్రమండలి జాతీయ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మ రావు అన్నారు. 
 
స్థానిక గుంటూరు రోడ్డులోని ఫ్లై ఓవర్ క్రింద ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద  కళామిత్రమండలి, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ సభకు నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ళ అరుణ గారు అధ్యక్షత వహించారు. 
 
ఈ సభలో వివిధ సాహితీ సాంస్కృతిక కళా రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించారు. ప్రముఖ సాహితీవేత్త నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, శ్రీ కృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ కుర్రా ప్రసాద్ బాబు, సుప్రసిద్ధ ప్రజా గాయకుడు శ్రీ నూకతోటి శరత్ బాబు, నాటక రంగ ప్రముఖులు శ్రీ మిడసల మల్లికార్జునరావు ,ప్రముఖ పాత్రికేయులు శ్రీ మాగంటి శ్రీనివాసమూర్తి గార్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. 
 
ముందుగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలతో అలంకరించి, మదరాసీలుగా గుర్తింపబడే తెలుగు వారికి ప్రపంచఖ్యాతిని తీసుకువచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు, గిడుగు వారి విగ్రహాలకు,
చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, నినాదాలు చేశారు. ప్రభుత్వం తరపున కూడా తెలుగు భాషా ఉత్సవాలను నిర్వహిస్తే బాగుంటుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. 
 
కార్యక్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి, నాళం నరసమ్మ, బీరం అరుణ,అంగలకుర్తి ప్రసాద్, ధేనువుకొండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!

సాక్షి ప్రకటనల రూపంలో అడ్డుగోలుగా రూ.443 కోట్లు దోచిపెట్టారు..

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోం.. చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ మొదలైంది

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

తర్వాతి కథనం
Show comments