Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దంగల్' నటి వేధింపుల కేసు .. నిందితుడికి బెయిల్

'దంగల్' ఫేం జైరా వసీంపై వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితుడు వికాస్ సచ్‌దేవ్‌కు ముంబై సెషన్స్ కోర్టు రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చే

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (10:20 IST)
'దంగల్' ఫేం జైరా వసీంపై వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితుడు వికాస్ సచ్‌దేవ్‌కు ముంబై సెషన్స్ కోర్టు రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. 
 
గతవారం విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఢిల్లీ నుంచి ముంబైకు వెళుతుండగా నటి జైరా వసీం పట్ల ముంబైకి చెందిన వ్యాపారవేత్త వికాస్ సచ్‌దేవ్ అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెల్సిందే. దీనికి సంబంధించి ఓ వీడియోను జైరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. 
 
దీన్ని సీరియస్‌గా తీసుకున్న పౌర విమానయానశాఖ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. దీంతో సచ్‌దేవ్‌పై కేసు నమోదు చేసి, ఈ నెల 10న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా, ఈనెల 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments