Webdunia - Bharat's app for daily news and videos

Install App

యంగ్ టైగర్ తీసుకున్న నిర్ణయాలు, వ్యక్తిగత సిబ్బంది కోసం ఏం చేసాడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (20:49 IST)
చక్కటి నటన, అద్భుతమైన డైలాగ్ డెలివరీలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల పరంగానే కాకుండా తన అభిమానులు, ప్రజల పట్ల ప్రేమను చూపిస్తూ, సామాజిక సమస్యలపై స్పందిస్తూ అంతకు మించి మంచి పేరును తెచ్చుకున్నాడు.
 
ఒక్కో సినిమాకు మరింతగా పరిణితి చెందిన నటుడిగా ఎదుగుతూనే ఆపద సమయంలో తనను నమ్ముకున్నవారికి చేయూతనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరోనా కష్టాల నుండి సినీ కార్మికులను కాపాడటానికి సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ) ఏర్పాటు చేసి, దానికి రూ. 25 లక్షల విరాళం అందించాడు, ఆ తర్వాత పరిశ్రమలోని హీరోలంతా కూడా దీనికి విరాళాలు ఇచ్చారు. దీనితో పాటుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విరాళం అందించాడు.
 
ఇక తన వద్ద పని చేస్తున్న వ్యక్తిగత సిబ్బందికి ఇప్పుడు మరో సాయం అందించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన వద్ద నమ్మకంగా పని చేస్తున్న టీమ్ సభ్యుల యొక్క కుటుంబాల పూర్తి బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ ఉన్నంత కాలం వారి బాధ్యతలను తానే తీసుకుంటానని ప్రకటించాడు. వారి వేతనాన్ని పెంచడంతో పాటుగా రాబోయే రోజులలో వారికి ఏ ఆపద వచ్చినా తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments