Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్క సుష్మిత కొణిదెల ఆశీస్సులు తీసుకున్న తమ్ముడు ప్రశాంత్‌

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (20:05 IST)
Sushmita Konidela, Director Prashant
మెగాస్టార్‌ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాతగా పలు ప్రాజెక్ట్‌లు చేస్తుంది. ఆమధ్య వెబ్‌ సిరీస్‌ చేసింది కూడా. తాజాగా శ్రీదేవి శోభన్‌బాబు అనే సినిమాను తన భర్త విష్ణుప్రసాద్‌తో నిర్మించింది. ఈ సినిమాకు ప్రశాంత్‌ దర్శకుడు. ఆయన సుష్మితగారిని అనుకోకుండా జూబ్లీహిల్స్‌లోని కాఫీషాప్‌లో కలిశాడట. ఆ వివరాలు చెబుతూ, నేను ఓ రోజు కాఫీషాప్‌కు వెళ్ళాను. అక్కడ సుష్మితగారు తన ఇద్దరు కుమార్తెలతో ఓ టేబుల్‌ దగ్గర వున్నారు. నేను, సంతోష్‌ కలిసి కాఫీ షాప్‌కు వచ్చాం. సుష్మితగారిని చూడగానే ఒక్కసారిగా చిరంజీవిగారు గుర్తుకువచ్చారు.

అంత పెద్ద స్టార్‌ కూతురు ఎలాగైనా మాట్లాడాలని ధైర్యం చేసి ఆమె టేబుల్‌ దగ్గరకు వెళ్లి సుష్మిత అక్క అని అన్నాను. నేను చిరంజీవిగారికి వీరాభిమానిని. అందుకే మీరు నాకు అక్క అవుతారని చెప్పగానే. నేను దర్శకుడిని అవ్వాలని కథ రాసుకున్నాను అని చెప్పాను. ఆమె చాలా కాజువల్‌గా నా ఫోన్‌ నెంబర్‌ తీసుకుంది. ఆ వెంటనే నేను వచ్చేశాను. ఆ తర్వాత అరె.. అక్క నెంబర్‌ తీసుకోలేదే! అని ఆలోచించాను. ఈ విషయం గమనిస్తున్న సంతోష్‌, మరో స్నేహితుడు ఏంటి ఇంతడేర్‌గా వెళ్ళి మాట్లాడావ్‌! అని నన్ను అడిగారు. ఇదంతా చిరంజీవిగారి స్పూర్తి అన్నాను.. అని చెప్పారు.
 
ఆ తర్వాత కట్‌ చేస్తే శ్రీదేవి శోభన్‌ బాబు సినిమాకు దర్శకుడిగా ఆఫర్‌ వచ్చింది. అక్క గర్వపడేలా సినిమా చేశానంటూ ప్రీరిలీజ్‌లో మాట్లాడారు. ఫైనల్‌గా సుష్మిత స్పందిస్తూ.. ప్రశాంత్‌ లాంటి తమ్ముడు నాకు దొరకడం చాలా ఆనందంగా వుంది. మనం ఇంటిలో ఎలా ఉంటామో, మహిళలు ఎలా బిహేవ్‌ చేస్తారో ఈ  సినిమాలో చూపించారు. కుటుంబంతో హాయిగా చూసే సినిమాగా మలిచాడు. సోదరుడు ప్రశాంత్‌ మరలా మా బేనర్‌లోనే సినిమాలు చేయాలి అని అన్నారు. ఆ వెంటనే దర్శకుడు ప్రశాంత్‌ అక్క సుష్మిత కాళ్ళకు నమస్కరిస్తూ ఆశీర్వాదాలు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments