Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృదేవోభవ రీమేక్.. నయన, అనుష్క, కీర్తి సురేష్‌లలో ఎవరు..?

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (19:57 IST)
తెలుగులో విజయవంతమైన చిత్రాలలో మాతృదేవోభవ ఒకటి. కె.ఎస్.రామారావు నిర్మాత. అజయ్ కుమార్ కె ఈ చిత్ర దర్శకుడు. మాధవి, నాజర్ ప్రధాన పాత్రల్లో 3 దశాబ్దాల క్రితం విడుదలైంది ఈ చిత్రం. త్వరలో ఈ చిత్రాన్ని మళ్లీ తెలుగులో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిర్మాత, దర్శకుడు ఈ సినిమాని రీమేక్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఈ మేరకు నిర్మాత, దర్శకుడు ఇటీవల తెరవెనుక కథలు అనే షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఇంటర్వ్యూలో నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ, నయనతార ప్రధాన పాత్రతో ఈ చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. తన మొదటి ఎంపిక నయనతారేనని, అనుష్కతో పాటు కీర్తి సురేష్ కూడా ఈ సినిమాకి సరిపోతారని ఆయన అన్నారు.
 
అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాత ఇంకా తుది పిలుపునివ్వలేదు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే మరిన్ని విషయాలు వెల్లడికానున్నాయి.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments