పవన్ కల్యాణ్ కారు అమ్మింది ఎందుకో తెలుసా? తెలిస్తే సలాం కొడతారు..
శ్రీజ అనే క్యాన్సర్ బారిన పడిన బాలికను జనసేన అధినేత పవన్ కల్యాణ్ రక్షించిన సంగతి తెలిసిందే. ఆమె వైద్య ఖర్చులు భరించిన పవన్ కల్యాణ్ ఆమెను మనిషి చేశాడు. అలాంటి వ్యక్తి తాజాగా తన వద్ద నున్న జి55 మెర్సిడ
శ్రీజ అనే క్యాన్సర్ బారిన పడిన బాలికను జనసేన అధినేత పవన్ కల్యాణ్ రక్షించిన సంగతి తెలిసిందే. ఆమె వైద్య ఖర్చులు భరించిన పవన్ కల్యాణ్ ఆమెను మనిషి చేశాడు. అలాంటి వ్యక్తి తాజాగా తన వద్ద నున్న జి55 మెర్సిడెజ్ బెంజ్ కారును అమ్మేశాడు. అయితే ఈ కారును అమ్మాల్సిన పరిస్థితి పవన్కు ఎందుకొచ్చింది. తాను ఎంతగానో ఇష్టపడి కొనుకున్న కారును పవన్ అమ్మేశాడంటే.. ఆయనకు ఎంత కష్టమొచ్చిందని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు.
కానీ పవన్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమేనని సన్నిహితులు అంటున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్కు నిర్మాతలలో ఒకరిగా వ్యవహరించిన పవన్ కల్యాణ్కు భారీ నష్టాలే వచ్చాయి. కానీ పవన్ ఓ మంచి పని కోసమే తన కారును అమ్మేశాడని వార్తలు వస్తున్నాయి. ఒకానొక సందర్భంలో గుండెజబ్బులతో బాధ పడుతున్న చిన్నారులకు ఆపరేషన్ చేయిస్తానని మాటిచ్చిన పవన్ కల్యాణ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం, చేతిలో క్యాష్ లేకపోవడంతో ఆయన తన కారును అమ్మి చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించాడట.
దాంతో పాటు త్వరలో తాను రాజకీయాల్లో బిజీ కానుండటంతో ఆయన కారును అమ్మి చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారని తెలిసింది. ఖరీదైన వస్తువులు తనను ప్రజల నుంచి దూరం చేస్తాయనే ఉద్దేశంతో కారును అమ్మేసినట్లు తెలిసింది. అదే గనక నిజమైతే పవన్ కల్యాణ్కు సలాం కొట్టాల్సిందే.