Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న రణవీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులు(Video)

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (18:18 IST)
బాలీవుడ్ సినీ తారలు రణవీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. నవంబర్ 14వ తేదీతో ఈ బాలీవుడ్ ప్రేమ పక్షులు దంపతులై ఏడాది అయ్యింది. వెడ్డింగ్ యానివర్సరీని పురస్కరించుకుని ఈ జంట శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం రాత్రి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చిన వీరు, రోడ్డు మార్గంలో తిరుమల చేరుకొని శ్రీకృష్ణ అతిథి గృహంలో బస చేసారు. 
గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో ఉత్తర భారతదేశానికి సంబంధించిన సంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకుని, అనంతరం గర్భగుడిలోని శ్రీవారి మూలవిరాట్‌ను దర్శించుకున్నారు.
 
అనంతరం హుండీలో కానుకలు చెల్లించి వివాహ మొక్కుబడి చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన దీపిక, రణ్ వీర్ లను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు. 
 
ఇంకా పెళ్లినాటి వస్త్రధారణతో దీపికా, రణ్ వీర్ కనిపించడంతో అభిమానులను వారిని కళ్లార్పకుండా చూశారు. ఈ దంపతులకు వివాహం జరిగి ఏడాది కావడంతో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రణ్ వీర్, దీపికా కుటుంబీకులు వారితో పాటు శ్రీవారిని దర్శించుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments