Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలైవిగా కంగనా రనౌత్... ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి (video)

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (14:56 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా పలు చిత్రాలు (బయోపిక్‌లు) తెరకెక్కుతున్నాయి. వీటిలో కొన్ని ప్రీప్రొడక్షన్ దశలో ఉండగా, మరికొన్ని షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తలైవి పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 
 
రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా కంగనా రనౌత్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనుంది. 
 
ఈ నాలుగు పాత్రల్లో అతి ముఖ్యమైన పాత్ర స్వర్గీయ ఎంజీఆర్‌ దగ్గరకు చేరదీయడం. జయలలిత జీవితంలో కూడా ఎంజీఆర్ పాత్రకు ప్రత్యేకత ఉంది. ఈ పాత్రలో ప్రస్తుతం కోలీవుడ్ మన్మథుడు అరవింద్  స్వామి కనిపించనున్నారు. 
 
దీనికి సంబంధించిన లుక్‌కు తాజాగా విడుదల చేశారు. షూట్‌లో పాల్గొనే ముందు అర‌వింద్ స్వామి ఫోటోకి ఫోజిచ్చారు. ఆ పిక్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. క్లీన్ షేవ్ చేసుకొని పూర్తి గ్లామర్ లుక్‌లో ఉన్న అర‌వింద్ స్వామి ఫోటో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments