Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

దేవీ
మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (09:47 IST)
Maheshbabu-1
సినిమా హీరోలు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తో పలు యాడ్స్ లు చేస్తూవుండడం మామూలే. గతంలో సాయి సూర్య డెవలపర్స్, సురారా ప్రాజెక్ట్ లపై మహేష్ ప్రచారకర్తగా వున్నారు. గత ఏడాది సాయిసూర్య వాళ్ళు మోసం చేశారని కొంతమంది ఫిర్యాదు చేశారు. ఇదంతా మహేష్ బాబు ప్రచారం వల్లే జరిగిందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఎట్టకేలకు నేడు మహేష్ బాబుపై ఆ ఎఫెక్ట్ పడింది. 
 
వివరాల్లోకి వెళితే... మహేష్ బాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు తమ కార్యాలయానికి రావాలని కోరింది. దానికి కారణం సాయి సూర్య డెవలపర్స్, సురారా ప్రాజెక్ట్ లపై ఈడీ కేసుల్లో భాగంగా విచారణ చేపట్టంది. అందులో మహేష్ బాబుకు వారు దాదాపు 6కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అందులో కొంత ఆన్ లైన్ చేయగా, కొంత కేష్ ఇచ్చారట. దానిపైన క్లారిటీ రావాలని ఈడీ కోరినట్లు తెలుస్తోంది.
 
కాగా, దీనిపై తెలుగు ఫిలింఛాంబర్ లో ప్రముఖ నిర్మాత మాట్లాడుతూ, ఈడీ నోటీసులు అనేవి కామన్. దానిపై క్లారిటీ ఇస్తే సరిపోతుంది. అసలు ప్రైవేట్ వ్యక్తల బిజినెస్ వ్యవహారాల్లో ఆచితూచి సెలబ్రిటీలు వ్యవహరించాలని తెలియజేస్తున్నారు. దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ, ఇంకా దీనిపై తనకు పూర్లి క్లారిటీ లేదని సమాధానమిచ్చారు. ఇదిలా వుండగా, ప్రస్తుతం విదేశాలనుంచి వచ్చిన మహేష్ బాబు రాజమౌళి సినిమాను చేయడానికి సన్నద్ధం అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు

ప్రపంచ ధరిత్రి దినోత్సవం- మన శక్తి, మన గ్రహం థీమ్ ఇదే!

Namo Bharat: ఏప్రిల్ 24న నమో భారత్ రాపిడ్ రైలు సేవను ప్రారంభించనున్న ప్రధాని

Woman Constable: ఆర్థిక ఇబ్బందులు: ఆత్మహత్యకు పాల్పడిన మహిళా కానిస్టేబుల్

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments