Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు నోటిపై వేళ్ళేసుకున్నారట.. ఎందుకు?

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (22:34 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఇప్పటికే సినీ యూనిట్ సభ్యుల్లో ఉంది. స్వయంగా చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ్ సతీమణి ఉపాసన నిర్మాతగా ఈ చిత్రం నిర్మింతం కాగా సురేంద్రరెడ్డి దర్సకత్వం వహించారు.
 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో తెరకెక్కిన చిత్రంలో చిరంజీవి నటన అద్భుతమంటున్నారు సెన్సార్ బోర్డు సభ్యులు. సాధారణంగా సినిమా రిలీజ్ కు ముందు సెన్సార్ బోర్డుకు సినిమా చూపించి అందులో సన్నివేశాలను కట్ చేస్తూ ఉంటారు. అయితే సైరా సినిమా చూసిన అభిమానులు మాత్రం అద్భుతంగా ఉందంటూ కితాబివ్వడమే కాకుండా యుఎ సర్టిఫికెట్ ఇచ్చారట. 
 
అంతేకాదు ఒక్క సన్నివేశాన్ని కూడా కట్ చేయలేదట. సెన్సార్ బోర్డు సభ్యులు ఎప్పుడూ సినిమా విజయవంతం అవుతుందా లేదా అన్న విషయం చెప్పరు. కానీ సైరా సినిమా చూసిన తరువాత సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమా వందరోజులకు పైగా ఆడుతుందని.. మెగాస్టార్ పేరును మరింత పెంచేస్తుందని చెప్పారట. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కాబోతోంది. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments