Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు నోటిపై వేళ్ళేసుకున్నారట.. ఎందుకు?

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (22:34 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఇప్పటికే సినీ యూనిట్ సభ్యుల్లో ఉంది. స్వయంగా చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ్ సతీమణి ఉపాసన నిర్మాతగా ఈ చిత్రం నిర్మింతం కాగా సురేంద్రరెడ్డి దర్సకత్వం వహించారు.
 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో తెరకెక్కిన చిత్రంలో చిరంజీవి నటన అద్భుతమంటున్నారు సెన్సార్ బోర్డు సభ్యులు. సాధారణంగా సినిమా రిలీజ్ కు ముందు సెన్సార్ బోర్డుకు సినిమా చూపించి అందులో సన్నివేశాలను కట్ చేస్తూ ఉంటారు. అయితే సైరా సినిమా చూసిన అభిమానులు మాత్రం అద్భుతంగా ఉందంటూ కితాబివ్వడమే కాకుండా యుఎ సర్టిఫికెట్ ఇచ్చారట. 
 
అంతేకాదు ఒక్క సన్నివేశాన్ని కూడా కట్ చేయలేదట. సెన్సార్ బోర్డు సభ్యులు ఎప్పుడూ సినిమా విజయవంతం అవుతుందా లేదా అన్న విషయం చెప్పరు. కానీ సైరా సినిమా చూసిన తరువాత సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమా వందరోజులకు పైగా ఆడుతుందని.. మెగాస్టార్ పేరును మరింత పెంచేస్తుందని చెప్పారట. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కాబోతోంది. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments