Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిలోకసుందరి జీవితంలోని మరపురాని ఘట్టాలు...

భారతీయ వెండితెరపై అతిలోకసుందరిగా ఖ్యాతిగడించిన శ్రీదేవి జీవితంలో అనేక మరుపురాని సంఘటనలు ఉన్నాయి. ఆమె శనివారం రాత్రి కన్నుమూసిన విషయం తెల్సిందే. దీంతో ఆమె జీవితంలోని మరుపురాని ఘట్టాలను ఓసారి పరిశీలిస్త

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (10:43 IST)
భారతీయ వెండితెరపై అతిలోకసుందరిగా ఖ్యాతిగడించిన శ్రీదేవి జీవితంలో అనేక మరుపురాని సంఘటనలు ఉన్నాయి. ఆమె శనివారం రాత్రి కన్నుమూసిన విషయం తెల్సిందే. దీంతో ఆమె జీవితంలోని మరుపురాని ఘట్టాలను ఓసారి పరిశీలిస్తే, 
 
శ్రీదేవి 1963, ఆగస్టు 13వ తేదీన తమిళనాడులోని మీనాంపుట్టిలో జన్మించింది. ఈమె తండ్రి ఓ న్యాయవాది. ఆ తర్వాత నాలుగేళ్లప్రాయంలోనే తమిళ సినిమాలో నటించింది. శ్రీదేవికి ఒక సోదరి, ఇద్దరు సవతి సోదరులు ఉన్నారు.
 
1976 వరకూ శ్రీదేవి బాలనటిగా పలు చిత్రాల్లో నటించింది. 1976లో ఆమె తమిళ సినిమా 'మందరూ ముదిచి' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. 1971 నాటికే శ్రీదేవి పలు అవార్డులు అందుకుంది. మలయాళం సినిమా 'మూవీ పూమ్ బత్తీ'లో నటనకుగాను కేరళ రాష్ట్రస్థాయి అవార్డు అందుకుంది.
 
1979లో హిందీ చిత్రరంగంలో ఆమె కాలు మోపింది. "హిమ్మత్‌వాలా"లో తిరుగులేని విజయ పరంపర కొనసాగించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా గుర్తింపు పొందింది. 
 
1996లో శ్రీదేవి... నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకోగా, వారికి ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, ఖుషి. శ్రీదేవి తన సుదీర్ఘ సినీ జీవితంలో శ్రీదేవి మొత్తం 200 సినిమాల్లో నటించింది. హిందీలో 63, తెలుగులో 62, తమిళంలో 58, మలయాళంలో 21 సినిమాల్లో నటించింది. 

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments