Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్జీవీ వ్యూహం సినిమాకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా

సెల్వి
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (16:09 IST)
తెలంగాణ హైకోర్టు దర్శకుడు ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై తెలుగుదేశం నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసి, మరోసారి పరిశీలించాక సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించింది. 
 
దీంతో కోర్టు ఆదేశాలతో మరోసారి ఈ సినిమా సెన్సార్ బోర్డు రివ్యూ చేసి పలు సూచనలు ఇచ్చింది. అలాగే కొన్ని సన్నివేశాలు కూడా తొలగించి కొత్త రిపోర్టును హైకోర్టుకు సమర్పించింది. 
 
దీనిని ఆమోదించిన హైకోర్టు ఈ మూవీని విడుద‌ల చేసుకోవ‌చ్చ‌ని ఆదేశాలు జారీ చేసింది.. దీంతో వ్యూహం సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 16న విడుదల కానుంది. వ్యూహం సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించారు. వైఎస్ భారతి పాత్రను మానస పోషించారు. 
 
రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే  వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందించిన యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

National Nutrition Week: జాతీయ పోషకాహార వారం.. ఇవి తీసుకుంటే?

ఇంటిలోని దుష్టశక్తులు పోయేందుకు మవనడిని నర బలిచ్చిన తాత...

బీసీలకు న్యాయం చేయాలంటే.. ఢిల్లీలో కాంగ్రెస్‌తో కలిసి నిలబడతాం: కేటీఆర్

ఏపీ మంత్రి నారా లోకేష్‌కు అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియా సర్కారు నుంచి పిలుపు

రోడ్లపై తిరగని వాహనాలు పన్నులు చెల్లించక్కర్లేదు : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments