Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకులే భక్తులు.. నేను బస్సును నడిపే డ్రైవర్‌ను : కళాతపస్వి (టీజర్)

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (10:50 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో హిమాలయా పర్వతమంత ఎత్తులో ఉండే దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్. పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా విశ్వదర్శనం అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి జనార్థన్ మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్‌ ప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. 'వందేళ్ల వెండితెర చెబుతున్న తొంభై ఏళ్ల బంగారు దర్శకుడి కథ' అన్న లేడీ వాయిస్ డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. రాధికా శరత్‌కుమార్‌, సుశీల, భానుప్రియ, ఆమని, శైలజ, విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు విశ్వనాథ్‌ గొప్పతనం గురించి టీజర్‌లో వివరించారు.
 
ఈ టీజర్‌లో యంగ్ విశ్వనాథ్‌కు సంబంధించిన అలనాటి ఫొటోలను అద్భుతంగా చూపించారు. 'సినిమా అనే ఓ బస్సును పట్టుకుని, సినిమా చూసేవారు ప్రేక్షకులను భక్తులుగా భావించి.. నేను బస్సు నడిపే డ్రైవర్‌ను. ఏం చేయాలి నేను?' అంటూ టీజర్ ఆఖర్లో విశ్వనాథ్‌ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments