Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకులే భక్తులు.. నేను బస్సును నడిపే డ్రైవర్‌ను : కళాతపస్వి (టీజర్)

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (10:50 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో హిమాలయా పర్వతమంత ఎత్తులో ఉండే దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్. పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా విశ్వదర్శనం అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి జనార్థన్ మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్‌ ప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. 'వందేళ్ల వెండితెర చెబుతున్న తొంభై ఏళ్ల బంగారు దర్శకుడి కథ' అన్న లేడీ వాయిస్ డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. రాధికా శరత్‌కుమార్‌, సుశీల, భానుప్రియ, ఆమని, శైలజ, విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు విశ్వనాథ్‌ గొప్పతనం గురించి టీజర్‌లో వివరించారు.
 
ఈ టీజర్‌లో యంగ్ విశ్వనాథ్‌కు సంబంధించిన అలనాటి ఫొటోలను అద్భుతంగా చూపించారు. 'సినిమా అనే ఓ బస్సును పట్టుకుని, సినిమా చూసేవారు ప్రేక్షకులను భక్తులుగా భావించి.. నేను బస్సు నడిపే డ్రైవర్‌ను. ఏం చేయాలి నేను?' అంటూ టీజర్ ఆఖర్లో విశ్వనాథ్‌ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.
 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments