Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకులే భక్తులు.. నేను బస్సును నడిపే డ్రైవర్‌ను : కళాతపస్వి (టీజర్)

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (10:50 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో హిమాలయా పర్వతమంత ఎత్తులో ఉండే దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్. పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా విశ్వదర్శనం అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి జనార్థన్ మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్‌ ప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. 'వందేళ్ల వెండితెర చెబుతున్న తొంభై ఏళ్ల బంగారు దర్శకుడి కథ' అన్న లేడీ వాయిస్ డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. రాధికా శరత్‌కుమార్‌, సుశీల, భానుప్రియ, ఆమని, శైలజ, విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు విశ్వనాథ్‌ గొప్పతనం గురించి టీజర్‌లో వివరించారు.
 
ఈ టీజర్‌లో యంగ్ విశ్వనాథ్‌కు సంబంధించిన అలనాటి ఫొటోలను అద్భుతంగా చూపించారు. 'సినిమా అనే ఓ బస్సును పట్టుకుని, సినిమా చూసేవారు ప్రేక్షకులను భక్తులుగా భావించి.. నేను బస్సు నడిపే డ్రైవర్‌ను. ఏం చేయాలి నేను?' అంటూ టీజర్ ఆఖర్లో విశ్వనాథ్‌ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments