Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్ ఉగ్రరూపం రత్నం లుక్ - సమ్మర్‌లో సినిమా విడుదల

డీవీ
బుధవారం, 17 జనవరి 2024 (09:38 IST)
Vishal, Ratnam Look
మాస్ యాక్షన్ హీరో విశాల్ రత్నం చిత్రంతో త్వరలోనే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి హరీ డైరెక్టర్‌గా, కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. ఈ మూవీలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి  దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ షాట్ టీజర్‌, పాటలు ఇలా ఇప్పటి వరకు వదిలిన ప్రతీ అప్డేట్ అందరినీ ఆకట్టుకున్నాయి.
 
తాజాగా విశాల్ తన ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. రత్నం సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 
ఈ పోస్టర్‌లో విశాల్ ఉగ్రరూపాన్ని చూపించారు. వెనకాల బ్యాక్ గ్రౌండ్‌లో కాళీ మాతను కూడా చూపించారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే తెరపై ఊచకోత గ్యారెంటీ అన్నట్టుగా కనిపిస్తోంది.
 
సమ్మర్‌లో రత్నం సినిమాను విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సంబంధించిన మిగతా అప్డేట్లు త్వరలోనే వెల్లడించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments