Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ ... ఫోటో వైరల్

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (12:02 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఇటీవ‌ల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, జ‌న‌వ‌రి నుండి మ‌రో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. 
 
2020లో ఈ మూవీ విడుద‌ల కానుంది. అయితే ఈ రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ అంటే అభిమానుల‌లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. గ‌తంలో వీరు ముగ్గురు క‌లిసి దిగిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అయింది.
 
పైగా, ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ వార్త ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేకిత్తిస్తోంది. అతి త్వ‌ర‌లో చెర్రీ న‌టించిన "వినయ విధేయ రామ" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారట. 
 
అయితే ఈ ఈవెంట్‌కు రాజమౌళి, ఎన్టీఆర్‌ని ఆహ్వానించాలని చిత్ర బృందం భావించిన‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్ర నిర్మాత దానయ్యనే 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని కూడా నిర్మస్తుండడంతో ఎన్టీఆర్, రాజమౌళి ఈ ఈవెంట్లో పాల్గొన‌డం ప‌క్కా అని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments