Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ - సమంతలకు గాయాలు : క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్

Webdunia
మంగళవారం, 24 మే 2022 (12:20 IST)
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంతలు షూటింగ్‌లో గాయపడినట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం "ఖుషి". శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుంటే, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను ఇటీవలే కాశ్మీర్‌లో పూర్తి చేసుకుంది. దాదాపు 30 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. 
 
ఇందులో విజయ్, సమంత, వెన్నెల కిషోర్, శరణ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్, సమంతలు గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. కాశ్మీరులోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నపుడు వీరిద్దరూ లిడ్డర్ నదిలో పడిపోయారని, దీంతో వారికి స్వల్పంగా గాయపడినట్టు వార్తలు వచ్చాయి. 
 
వీటిని చిత్ర బృందం తోసిపుచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. టీం అంతా కాశ్మీరులో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని విజయవంతంగా హైదరాబాద్ నగరానికి చేరుకున్నట్టు తెలిపింది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దని కోరింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని పేర్కొంది.

 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments