Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ - సమంతలకు గాయాలు : క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్

Webdunia
మంగళవారం, 24 మే 2022 (12:20 IST)
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంతలు షూటింగ్‌లో గాయపడినట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం "ఖుషి". శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుంటే, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను ఇటీవలే కాశ్మీర్‌లో పూర్తి చేసుకుంది. దాదాపు 30 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. 
 
ఇందులో విజయ్, సమంత, వెన్నెల కిషోర్, శరణ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్, సమంతలు గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. కాశ్మీరులోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నపుడు వీరిద్దరూ లిడ్డర్ నదిలో పడిపోయారని, దీంతో వారికి స్వల్పంగా గాయపడినట్టు వార్తలు వచ్చాయి. 
 
వీటిని చిత్ర బృందం తోసిపుచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. టీం అంతా కాశ్మీరులో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని విజయవంతంగా హైదరాబాద్ నగరానికి చేరుకున్నట్టు తెలిపింది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దని కోరింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని పేర్కొంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments