Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ విచారణ గురించి విజయ్‌దేవరకొండ ఒక్కటే మాట!

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (10:11 IST)
Vijaydevarakondat ed office media
ఇటీవలే లైగర్‌ దర్శకుడు, నిర్మాత అయిన పూరీ జగన్నాథ్‌, చార్మికౌర్‌లను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో విచారించారు. లైగర్‌ సినిమాకు కోట్ల రూపాయల పెట్టుబడి ఎలా వచ్చింది? అసలు వీటి వెనుక పెట్టుబడిదారులు ఎవరున్నారనేది అడిగారు. ఆ తర్వాత వారినుంచి ఎటువంటి సమాధానం మీడియాకు రాలేదు. కాగా, బుధవారంనాడు లైగర్‌ హీరో విజయ్‌దేవరకొండను దాదాపు 11గంటలపాటు ఈడీ అధికారులు తమ కార్యాలయంలో విచారణ చేశారు.
 
అనంతరం విజయ్‌దేవరకొండ మీడియా ముందు మాట్లాడుతూ, పేరు, ప్రఖ్యాతులు వస్తే ఇలాంటివి ఎదుర్కోవాల్సివుంటుంది. ప్రేక్షకుల ప్రేమ, అభిమానం ఎల్లప్పుడూ తనకు తోడుగా వుంటుందని తెలిపారు. ఈడీ అధికారులు విధి నిర్వహణలో భాగంగా వారు తనను విచారణ చేశారనీ, త్వరలో అన్నీ సమసిపోతాయని ఆశిస్తున్నానని అన్నారు. 
 
లైగర్‌ సినిమా వసూళ్ళు రాబట్టలేకపోయింది. విడుదలైన అన్నిచోట్ల నెగెటివ్‌ టాక్‌తో ప్లాప్‌ సినిమాగా మారింది. మరి ఈడీ అధికారులు ఎందుకు లైగర్‌ టీమ్‌ను విచారిస్తున్నారనేది క్లారిటీలేదు. దీనివెనుక రాజకీయకోణం దాగివుందని సినీవిశ్లేషకులు తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments