Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ సేతుపతి పిజ్జా 2 వ‌చ్చేస్తుంది...

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (16:43 IST)
విజయ్ సేతుపతి, గాయత్రి హీరోహీరోయిన్లుగా తమిళంలో తెరకెక్కిన చిత్రం 'పురియత్ పుధీర్'. తమిళంలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని 'పిజ్జా-2' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. గతంలో విజయ్ సేతుపతి నటించించిన 'పిజ్జా' చిత్రం తెలుగులో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు తెలుగులో 'పిజ్జా 2' గా టైటిల్ ఖరారు చేశారు. 
 
డి.వి.సినీ క్రియేష‌న్స్ మరియు లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌పై  ఉదయ్ హర్ష వడ్డేల్ల,  డి.వి.వెంక‌టేష్, సంయుక్తంగా డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు.
 
 ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా రూపొందించబడింది. 
 
ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి తెరకెక్కించారు. ఈ చిత్రంలో నేరం ఫేమ్ రమేష్ తిలక్, సోనియా దీప్తి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

Air India crash: మృతులకు కోటి రూపాయల నష్టపరిహారం.. 11A సీటులో వ్యక్తికి ఏమైంది?

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments