Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లైగర్' పెట్టుబడులపై నాకు తెలిసిన సమాచారం చెప్పా : విజయ్ దేవరకొండ

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (12:11 IST)
తాను నటించిన పాన్ ఇండియా మూవీ లైగర్ సినిమా పెట్టుబడుల గురించి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు తనకు తెలిసిన విషయాలను వెల్లడించారు. ఈయన వద్ద ఈడీ అధికారులు సుమారు 12 గంటల పాటు విచారణ జరిపారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ రాత్రి 9 గంటలకు వరకు సాగింది. ఉదయం నుంచి ఏకధాటిగా విజయ్ దేవరకొండ వద్ద ఈడీ అధికారులు విచారణ జరిపారు. 
 
ఈ విచారణ తర్వాత ఆయన అధికారులతో మాట్లాడుతూ, పాపులారిటీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం మామూలేనని వ్యాఖ్యానించారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారని అందువల్లే తాను ఈడీ కార్యాలయానికి వచ్చినట్టు తెలిపారు. బాధ్యతగల పౌరుడిగా అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చినట్టు తెలిపారు. తనను మళ్లీ రమ్మని పిలవలేదన్నారు. 
 
కాగా, 'లైగర్' చిత్రాన్ని రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా, ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఈ పెట్టుబడులలో మనీలాండరింగ్, హవాలా కోణాలపై ఈడీ దర్యాప్తుపై చేపట్టింది. ఈ చిత్ర నిర్మాతలు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీలను కూడా ఈడీ ఇప్పటికే విచారించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం