గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎలా ఆటపట్టించేవారో వివరించిన విజయ్ దేవరకొండ

ఠాగూర్
గురువారం, 23 మే 2024 (12:10 IST)
విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ఇద్దరూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. తాజాగా విజయ్‌ మూడు సినిమాలు ప్రకటించగా.. ఆనంద్‌ 'గం.. గం.. గణేశా'తో ప్రేక్షకుల ముందుకురానన్నారు. మే 31వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆనంద్‌ ప్రెస్మీట్‌లో విజయ్‌ ఫోన్‌లో అందుబాటులోకి వచ్చి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎలా ఆటపట్టించే వారో చెప్పి నవ్వులు పూయించారు.
 
'మా ఇద్దరి వాయిస్‌ ఒకేలా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మకు కూడా మాలో ఎవరు పిలిచారో అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత మా ఫ్రెండ్స్‌ను, గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఆటపట్టించేవాళ్లం. నా మిత్రులు ఫోన్‌ చేస్తే ఆనంద్‌ మాట్లాడేవాడు. వాళ్లు నేను మాట్లాడుతున్నా అనుకొనే వారు. కాలేజ్‌ డేస్‌లో ఇలా ఎక్కువగా ప్రాంక్‌ చేసేవాళ్లం. నా సినిమాలో ఆనంద్‌తో డబ్బింగ్‌ చెప్పించాలని ప్రయత్నించాను' అన్నారు. 
 
'గం.. గం.. గణేశా' గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ట్రైలర్‌ చాలా బాగుందని అభినందించారు. ప్రీ రిలీజ్‌కు రావాలనుందని.. కానీ, వైజాగ్‌లో షూటింగ్‌ కారణంగా హాజరుకాలేకపోతున్నట్లు చెప్పారు. 'గం.. గం.. గణేశా' కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. 'బేబి' లాంటి సూపర్ హిట్‌ తర్వాత ఆనంద్‌ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఇది ఓ విగ్రహం చోరీ చుట్టూ తిరిగే కథ. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీ వాస్తవ కథానాయికగా కనిపించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లు అర్జున్‌కు వార్నింగ్ ఇచ్చిన పోలీస్ అధికారి మృతి.. ఎలా?

భారత నౌకాదళంలో చేరిన మరో యుద్దనౌక 'అండ్రోత్'

బీసీ రిజర్వేషన్‌లపై తెలంగాణ సర్కారుకు సుప్రీంలో ఊరట

సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన .. సీజేఐపై న్యాయవాది దాడికి యత్నం

Watching TV: పదివేల రూపాయలు ఇవ్వలేదని.. తల్లిని హత్య చేసిన కుమారుడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments