Webdunia - Bharat's app for daily news and videos

Install App

వియన్నాకు వెళ్లి చిక్కుల్లో పడ్డ విద్యుల్లేఖా రామన్.. బ్యాగు.. పాస్ పోర్టు, నగదు మిస్!?

Webdunia
బుధవారం, 4 మే 2016 (16:38 IST)
కామెడీ నటీమణిగా పేరు సంపాదించిన విద్యుల్లేఖా రామన్ వియన్నాకు వెళ్లి చిక్కుల్లో పడ్డారు. రాజుగారి గది, రన్ రాజా రన్, సరైనోడు వంటి సినిమాల్లో కామెడీ నటీమణిగా మంచి గుర్తింపు సంపాదించిన విద్యుల్లేఖా స్నేహితులతో కలిసి ఇటీవల ఆస్ట్రియాలోని వియన్నాకు పర్యటన కోసం వెళ్లారు.

అయితే అక్కడ ఆమె తన బ్యాగును పోగొట్టుకున్నారు. సీనియర్ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖా బ్యాగులో పాస్ పోర్ట్, కార్డులు, నగదును పోగొట్టుకున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. 
 
హోటల్ లాబీలో ఎవరో తన బ్యాగును దొంగలించుకుపోయారని, ఆ దొంగలు ఎవరనే దానిపై విచారణ కోసం హోటల్ యాజమాన్యం సహకరించట్లేదని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిద్దామనుకుంటే అంగీకరించట్లేదని విద్యుల్లేఖా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో విదేశంలో నిస్సహాయ స్థితిలో ఉన్న తమను కాపాడాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌లను విద్యుల్లేఖా అభ్యర్థించారు. 
 
హోటల్ లాబీల్లో విద్యుల్లేఖా బ్యాగు అపహరణకు గురైందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. తమ కుమార్తెను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments