Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మహర్షి" చిత్రాన్ని తిలకించిన ఉపరాష్ట్రపతి ఫ్యామిలీ... మహేశ్ బాబుకు కితాబు

Webdunia
బుధవారం, 15 మే 2019 (10:11 IST)
ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం "మహర్షి". ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదలై ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పైగా, మంచి టాక్‌తో ప్రదర్శితమవుతూ ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందుతోంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో తిలకించారు. 
 
ఆ తర్వాత ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "తాను 'మహర్షి' సినిమాను కుటుంబ సభ్యులతో కలసి చూశానని, సినిమా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో మహేశ్ బాబు నటన ఎంతో సహజంగా ఉంది. మహేశ్ చక్కని నటన కనబరిచారు. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను ఈ సినిమా గుర్తుకు తెచ్చిందంటూ పోస్ట్ చేశారు. 
 
"గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం 'మహర్షి'. సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేశ్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను" అని అన్నారు. 
 
"కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు 'మహర్షి' చిత్రాన్ని చూడటం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా" అని అన్నారు. 


 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments