Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం : నటుడు లోహితస్వ ప్రసాద్ కన్నుమూత

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (10:55 IST)
Lohithaswa
కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు లోహితస్వ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 80 యేళ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మరణంపై కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
 
కాగా, ఈయన 500కు పైగా చిత్రాల్లో నటించారు. పలు బుల్లితెర సీరియల్స్‌లో కూడా నటించారు. ఆయన చిత్రపరిశ్రమలోకి రాకముందు ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పని చేశారు. 
 
ఏపీ 47, దాదా, దేవా వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించారు. ఈయన తెలుగు చిత్రం అఖండలో ఎన్ఐఏ అధికారిగా నటించారు. వీటితో పాటు సాహో, అరవింద సమేత, జై లవకుశ  వంటి తెలుగు చిత్రాల్లో కూడా నటించారు.

సంబంధిత వార్తలు

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments