Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్ను ఇష్టపడిన వాళ్లను ఎప్పుడూ మిస్‌ యూస్‌ చేయకు.. చైతూ కోసమే..?

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (13:52 IST)
నారప్ప`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలు చేస్తున్నారు. అలాగే మరోవైపు రానా దగ్గుబాటితో కలిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నారు.

ఈ విషయాలు పక్కన పెడితే.. ఎప్పుడూ సినిమాలకు సంబంధించిన అప్డేట్సే ఇచ్చే వింకీ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లైఫ్‌ లెసన్స్ కూడా చెబుతున్నారు.

ముఖ్యంగా మేనల్లుడు నాగచైతన్య-సమంతలు విడిపోయిన తర్వాత.. ప్రేమ, నమ్మకం, జీవితం వంటి అంశాలపై వెంకీ తరచూ ఏదో ఒక కొటేషన్‌ పెడుతున్నారు. 
 
తాజాగా కూడా `నిన్ను ఇష్టపడిన వాళ్లను ఎప్పుడూ మిస్‌ యూస్‌ చేయకు. నిన్ను కావాలనుకుంటున్న వాళ్లకు బిజీగా ఉన్నానని చెప్పకు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారో వాళ్లను ఎప్పుడూ మోసం చేయకు. నిన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకునే వాళ్లని మర్చిపోవద్దు` అంటూ ఇన్‌స్టా స్టోరీలో వెంకీ పోస్ట్ పెట్టారు.

దీంతో కొందరు నెటిజన్లు చైతు-సామ్‌లకు వెంకీ తన కొటేషన్స్ ద్వారా పరోక్షంగా హితబోధ చేస్తున్నారని భావిస్తున్నారు. కారణం ఏదైనప్పటికీ వెంకీ ఇన్‌స్టా పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments