Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాను మహాద్భుతంగా చూపించే దర్శకుడు రాజమౌళి : వెంకయ్య

ప్రపంచంలో ఉన్న ఏడు అద్భుతాల‌ను కూడా మ‌హాద్భుతంగా చూపించ‌గ‌లిగేది సినిమా, అటువంటి సినిమాను మ‌రింత అద్భుతంగా చూపించ‌గ‌లిగే వ్యక్తి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. హై

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (06:50 IST)
ప్రపంచంలో ఉన్న ఏడు అద్భుతాల‌ను కూడా మ‌హాద్భుతంగా చూపించ‌గ‌లిగేది సినిమా, అటువంటి సినిమాను మ‌రింత అద్భుతంగా చూపించ‌గ‌లిగే వ్యక్తి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్ శిల్ప క‌ళా వేదిక‌లో  అక్కినేని నాగేశ్వ‌ర రావు జాతీయ పుర‌స్కారాన్ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి ఆయన ప్రదానం చేశారు. 
 
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, రాజ‌మౌళి చిన్న వ‌య‌సులోనే ఎంతో పేరు సంపాదించుకున్నాడని అన్నారు. తెలుగు సినిమాను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అక్కినేని పురస్కారాన్ని రాజమౌళికి ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు. 
 
ఇకపోతే.. ప్ర‌పంచ ఏడు వింత‌ల‌కు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు త‌న‌దైనశైలిలో కొత్త అర్థం చెప్పారు. ప్ర‌పంచంలో అద్భుతాల్లో ఒక‌టి చూడ‌గ‌ల‌గడం, రెండు విన‌గ‌ల‌గ‌డం, మూడు స్ప‌ర్శ, నాలుగు రుచి, ఐదు అనుభూతిని పొంద‌డం, ఆరు న‌వ్వ‌డం, ఏడు ప్రేమించ‌డం అని చెబుతుందన్నారు. ఈ ఏడు అద్భుతాల‌ను కూడా మ‌హాద్భుతంగా చూపించ‌గ‌లిగేది సినిమా అని వెంక‌య్య నాయుడు అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments