Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాను మహాద్భుతంగా చూపించే దర్శకుడు రాజమౌళి : వెంకయ్య

ప్రపంచంలో ఉన్న ఏడు అద్భుతాల‌ను కూడా మ‌హాద్భుతంగా చూపించ‌గ‌లిగేది సినిమా, అటువంటి సినిమాను మ‌రింత అద్భుతంగా చూపించ‌గ‌లిగే వ్యక్తి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. హై

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (06:50 IST)
ప్రపంచంలో ఉన్న ఏడు అద్భుతాల‌ను కూడా మ‌హాద్భుతంగా చూపించ‌గ‌లిగేది సినిమా, అటువంటి సినిమాను మ‌రింత అద్భుతంగా చూపించ‌గ‌లిగే వ్యక్తి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్ శిల్ప క‌ళా వేదిక‌లో  అక్కినేని నాగేశ్వ‌ర రావు జాతీయ పుర‌స్కారాన్ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి ఆయన ప్రదానం చేశారు. 
 
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, రాజ‌మౌళి చిన్న వ‌య‌సులోనే ఎంతో పేరు సంపాదించుకున్నాడని అన్నారు. తెలుగు సినిమాను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అక్కినేని పురస్కారాన్ని రాజమౌళికి ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు. 
 
ఇకపోతే.. ప్ర‌పంచ ఏడు వింత‌ల‌కు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు త‌న‌దైనశైలిలో కొత్త అర్థం చెప్పారు. ప్ర‌పంచంలో అద్భుతాల్లో ఒక‌టి చూడ‌గ‌ల‌గడం, రెండు విన‌గ‌ల‌గ‌డం, మూడు స్ప‌ర్శ, నాలుగు రుచి, ఐదు అనుభూతిని పొంద‌డం, ఆరు న‌వ్వ‌డం, ఏడు ప్రేమించ‌డం అని చెబుతుందన్నారు. ఈ ఏడు అద్భుతాల‌ను కూడా మ‌హాద్భుతంగా చూపించ‌గ‌లిగేది సినిమా అని వెంక‌య్య నాయుడు అన్నారు. 

సంబంధిత వార్తలు

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments