వరలక్ష్మి వచ్చేస్తోంది.. శరత్ కుమార్ అలా అనేశారేంటి?

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (17:50 IST)
అవును.. వరలక్ష్మీ నేరుగా తెలుగులో సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. తమిళ తెరకి కథానాయికగా పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్, ఆ తర్వాత కీలకమైన పాత్రల్లో సైతం మెప్పించింది. ఇటీవల సర్కార్, పందెంకోడి -2, మారి వంటి సినిమాల్లో తన నటనకు ప్రేక్షకుల వద్ద మంచి మార్కులేసుకుంది. తాజాగా  తెలుగులో నేరుగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతోంది. 
 
సందీప్ కిషన్ హీరోగా దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. హన్సిక కథానాయికగా చేయనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ''తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నెగటివ్ షేడ్స్ పాత్రలు ఎంచుకుంటున్న వరలక్ష్మి ఇటీవల.. రామకృష్ణ బీఏబీఎల్‌లో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో వేచి చూడాలి. 
 
ఇదిలా ఉంటే.. వరలక్ష్మి తండ్రి, నటుడు శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం నెట్టింట చర్చకు దారితీసింది. దక్షిణాది స్టార్ హీరోలు, రజనీకాంత్, కమల్ హాసన్‌లు తనకు స్నేహితులమేమీ కాదన్నారు. వారిద్దరూ తన సహ నటులు మాత్రమేనని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దసరా విక్రయాలు : 2 రోజుల్లో రూ.419 కోట్ల విలువ చేసే మద్యం తాగేశారు

ఏపీ, కర్ణాటక ఐటీ మంత్రుల మాటల యుద్ధం.. నారా లోకేష్ వర్సెస్ ఖర్గే కౌంటర్లు

స్వీట్ బేబీ డాటర్ డాల్.. నాతో ఒక రాత్రి గడుపుతావా?

విద్యార్థిని ప్రాణం తీసిన పెద్దనాన్న లైంగిక వేధింపులు

తెలంగాణకి రేవంత్ రెడ్డి ఇంకోసారి సీఎం కాలేడు: పగబట్టిన ప్రశాంత్ కిషోర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments