Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌‍ ఆ సీన్‌ను పండిస్తే.. శింబు కామెడీతో పగలబడి నవ్వించాడు..

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (12:10 IST)
త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో విడదలై సూపర్ హిట్ అయిన అత్తారింటికి దారేది సినిమా ఇటీవల తమిళంలో రీమేక్ చేయబడింది. 'వందా రాజాదాన్ వరువె' పేరుతో ఫిబ్రవరి 1న తమిళనాడులో విడుదలైన ఈ సినిమాలో శింబు హీరోగా నటించాడు.
 
అత్తారింటికి దారేది సినిమాలో పవన్ అద్భుతమైన నటన కనబరిచాడు. తన కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ నటనను ప్రదర్శించాడు. చివరలో రైల్వేస్టేషన్‌లో వచ్చే క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పుకోవాలి. ఇందులో పవన్ హావభావాలు, చాలా బాగున్నాయని ప్రశంసలు వెల్లువెత్తాయి.
 
అయితే ఇదే సీన్‌ను శింబు తమిళంలో కామెడీ చేసి పడేసాడు. తెలుగులో ఈ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు సీరియస్‌గా చూస్తే, తమిళంలో ఈ సీన్ చూసి ప్రేక్షకులు నవ్వుతున్నారట. ఇందులో అత్తయ్యగా నటించిన రమ్యకృష్ణతో శింబు డైలాగులు చెప్తుంటే జనం కామెడీ సీన్ లెక్క పగలబడి నవ్వుకున్నారట.
 
ఇప్పటికే ఈ సీన్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీని మీద ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. తెలుగు, తమిళ వెర్షన్‌లను కంపేర్ చేస్తూ రూపొందించిన వీడియోలను చూసి జనం నవ్వుకుంటున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments