Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఐదో సీజన్‌: టీవీ-9 యాంకర్ ప్రత్యూష ఎంట్రీ ఇస్తుందా?

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (21:04 IST)
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో పాల్గొనే వారి గురించి ప్రస్తుతం చర్చ మొదలైంది. ఈ జాబితాలో టిక్ టాక్ దుర్గా రావు ముందున్నాడు. తనకు అక్కడ్నుంచి ఫోన్ వచ్చిందని చెప్పాడు దుర్గా రావు. ఈయనతో పాటు యూ ట్యూబ్ స్టార్ షన్ముఖ్ జస్వంత్‌ను అడిగారని తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న బిజీలో.. ఆయనకు ఉన్న క్రేజ్ కారణంగా వెళ్తాడా అనేది అనుమానమే. 
 
మరోవైపు సింగర్ సునీతను కూడా బిగ్ బాస్ 5లో తీసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఆమె పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరొకరి పేరు కూడా బయటికి వచ్చింది. టీవీ-9 యాంకర్ ప్రత్యూషను బిగ్ బాస్ హౌజ్‌లోకి పిలుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
నిజానికి సీజన్ 2 నుంచి బిగ్ బాస్‌కు టీవీ 9కి విడదీయరాని అనుబంధం ఉంది. సీజన్-2లో దీప్తి నల్లమోతు వచ్చింది. దాదాపు 8 వారాలు ఉంది. మూడో సీజన్‌లో జాఫర్ వచ్చాడు. ఆయన రెండు వారాలు మాత్రమే ఉన్నాడు.
 
మొన్నటి సీజన్‌లో యాంకర్ దేవి నాగవల్లి వచ్చింది. ఈమె అనూహ్యంగా మూడో వారంలోనే ఇంటి ముఖం పట్టింది. ఈమె ఎలిమినేషన్‌పై అప్పట్లో వివాదం కూడా రేగింది. ఇప్పుడు వీళ్ల బాటలోనే ప్రస్తుతం టీవీ 9లో పని చేస్తున్న ప్రత్యూషను బిగ్ బాస్ హౌజ్‌కు పిలిచినట్లు తెలుస్తుంది. దీనికి ఈమె కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది.  

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments