Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన మాట‌ల మాంత్రికుడు

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (13:47 IST)
మాట‌ల మాంత్రికుడు అంటే చాలు ఠ‌క్కున ఆయ‌న పేరు గుర్తుకువ‌స్తోంది. ఎస్.. ఆయ‌నే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్. తాజాగా తెర‌కెక్కించిన చిత్రం అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. మీడియాకి దూరంగా ఉండే ఈ మాట‌ల మాంత్రికుడు.. గ‌త రెండు మూడు రోజులుగా మీడియాకి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. త‌న మ‌న‌సులో మాట‌ల‌ను పంచుకుంటున్నారు. 
 
ఇంత‌కీ త్రివిక్ర‌మ్ ఏం చెప్పారంటే... ఓ మంచి క‌థ చెప్పాల‌నే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేసార‌ట‌. 12 ఏళ్ల నుంచి ఎన్టీఆర్‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాను. ఇన్నాళ్ల‌కు ఈ క‌థ‌తో సెట్ అయ్యింద‌ని చెప్పారు. ఎన్టీఆర్ కోసం అనుకున్న క‌థ ఇదేనా..? లేక వేరే హీరోతో అనుకుంటే ఎన్టీఆర్‌కి సెట్ అయ్యిందా..? అని అడిగితే… ఎన్టీఆర్‌కు నాలుగైదు సబ్జెక్ట్‌లు చెబితే, ఇద్దరం కనెక్ట్ అయింది అరవింద స‌మేత క‌థకే అని చెప్పారు. 
 
ఇంకా చెప్పాలంటే ఓ కొత్త ఎన్టీఆర్ క‌నిపిస్తారు అని చెప్పారు. ఎన్టీఆర్ ప్రాణం పెట్టి ఈ సినిమా చేసాడు. అస‌లు ఎన్టీఆర్ కుటుంబంలో జ‌రిగిన విషాదంతో షాక్ అయి ఈ సినిమాను స‌మ్మ‌ర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ.. ఎన్టీఆర్ ఫోన్ చేసి షూటింగ్ ప్లాన్ చేయండి నేను షూటింగ్‌కి వ‌స్తాన‌ని చెప్పార‌ు‌. ఆయ‌న అంత విషాదంలో కూడా అలా న‌టించ‌డం వ‌ల‌నే ఈ సినిమా పూర్త‌య్యింద‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments