ఆ శృంగార సన్నివేశాలు చూసి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు.. కానీ.. : హీరోయిన్ త్రిప్తి డిమ్రి

ఠాగూర్
శుక్రవారం, 1 మార్చి 2024 (16:02 IST)
సందీవ్ వంగా దర్శకత్వంలో గత యేడాది వచ్చిన చిత్రం "యానిమల్". ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రి నటించారు. సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ హాట్ హాట్ శృంగార సన్నివేశాల్లో బోల్డ్‌గా నటించారు. దీంతో సూపర్ హిట్ కావడమే కాకుండా, పంపిణీదారులకు, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే, ఇందులో శృంగార సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై త్రిప్తి డిమ్రి స్పందించారు. 
 
'దర్శకుడు సందీప్‌ వంగా కథ నరేట్ చేసే సమయంలోనే నాది చాలా చిన్న పాత్ర అని స్పష్టంగా చెప్పారు. ఆ పాత్ర ఆసక్తికరంగా అనిపించింది. ప్రేక్షకులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ మన నిర్ణయాలు మార్చుకుంటే మనం చేయాలనుకున్నది ఎప్పటికీ చేయలేం. ఎప్పుడూ సౌకర్యవంతమైన పాత్రలే చేయాలని నేను అనుకోను. 
 
'యానిమల్‌'లో నేను నటించిన శృంగార సన్నివేశాలు చూసి నా తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. సినిమాకు ఆ సీన్‌ ఎంత ముఖ్యమో వారికి వివరించాను. గతంలో నా తొలి చిత్రం విడుదల తర్వాత మా నాన్న నేను నటినని అందరితో గర్వంగా చెప్పాలనుకున్నారు. అప్పుడు నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ చిత్రంతో నన్ను అందరూ గుర్తుపడుతున్నారు' అని చెప్పారు.
 
ఈ 'యానిమల్' బ్యూటీ ప్రస్తుతం 'మేరే మెహబూబ్‌ మేరే సనమ్‌', 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. విజయ్‌ దేవరకొండ - గౌతమ్‌ తిన్ననూరిల స్పై థ్రిల్లర్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు టాక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments