Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ నటి కవిత ఇంట కరోనా కల్లోలం.. మొన్న కుమారుడు, నేడు భర్త

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (11:26 IST)
ప్రముఖ సీనియర్ నటి ఇంట్లో కరోనా కల్లోలం సృష్టించింది. కరోనాతో మొన్న కొడుకును, ఈరోజు భర్తను పోగొట్టుకుని తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది సీనియర్ నటి కవిత. జూన్ 15న కోవిడ్ -19 సమస్యల కారణంగా ఆమె తన కొడుకును కోల్పోయారు. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కు కొన్నిరోజుల క్రితం కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 
 
దీంతో అతను ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాడు. అయితే అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లోనే అతను తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఇక కవిత భర్త దశరథ రాజ్ కూడా కోవిడ్ -19 బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా రోజులు కరోనాతో పోరాడిన ఆయన ఈ రోజు కన్నుమూసినట్టు సమాచారం.
 
ఇక పలు తెలుగు, తమిళ చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించిన కవిత ప్రస్తుతం “ఎండ్రెండ్రుం పున్నగై “అనే టీవీ షోలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. 11 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టింది. ఆ తరువాత దాదాపు 350 చిత్రాల్లో నటించారు కవిత. ఇప్పుడు ఈ సీనియర్ నటి చాలా తక్కువ కాలం గ్యాప్ లో కొడుకుని, భర్తను కోల్పోవడం విషాదకరం. దశరథ్ మరణించారన్న వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లైంగిక కోర్కె తీర్చాలని భర్త ఒత్తిడి: 53 ఏళ్ల భర్తను నరికేసిన 27 ఏళ్ల భార్య

తోతాపురి మామిడి పండ్ల ప్రవేశంపై నిషేధాన్ని ఉపసంహరించుకోండి.. బాబును కోరిన సిద్ధయ్య

Kalpika Ganesh: ప్రిజమ్ పబ్ వ్యవహారం.. కల్పికా గణేష్‌పై గచ్చిబౌలి స్టేషన్‌లో కేసు

భర్త దుబాయ్‌లో వుంటే భార్య వివాహేతర సంబంధం..వద్దు పోమ్మంది.. అంతే సూసైడ్

Vizag: విశాఖలో పౌర విమానయాన విశ్వవిద్యాలయం-సెప్టెంబర్ తర్వాత సీప్లేన్ కార్యకలాపాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments