Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఈడీ విచారణకు రానున్న హీరో తరుణ్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (10:46 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ సెలెబ్రిటీలను విచారిస్తూ వస్తున్నారు. ఆ కోవలో బుధవారం హీరో తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. 
 
ఈ కేసులో మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటివరకు 11 మందిని విచారించిన అధికారులు.. జాబితాలో చివరిలో ఉన్న తరుణ్‌ను ఈ రోజు ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ వాడే అలవాటు ఉందా? కెల్విన్‌తో సంబంధాలు ఉన్నాయా. అనే కోణంలో అధికారులు విచారించనున్నారు.
 
అలాగే, బ్యాంక్ స్టేట్‌మెంట్లతో విచారణకు హాజరుకావాలని తరుణ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌పై కూడా అధికారులు ప్రశ్నించనున్నారు. 'ఎఫ్ లాంజ్ పబ్' వ్యవహారాలు, నవదీప్ పార్టీలపై ఆరా తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
కాగా గతంలో డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ విచారణకు హాజరైన తరుణ్.. విచారణలో భాగంగా తరుణ్ నుంచి అధికారులు నమూనాలు సేకరించి ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. అయితే ఆ నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్‌ నివేదిక ఇచ్చింది. దీంతో తరుణ్, పూరీ జగన్నాథ్‌లకు ఎక్సైజ్ శాఖ క్లీన్‌ చీట్ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments