Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ డ్రగ్స్ కేసు : ఈడీ ముందుకు నటుడు తనీష్

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (15:48 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందుకు నటుడు తనీష్ వచ్చారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ముమైత్ ఖాన్, నవదీప్ వంటి వారు విచారణకు హాజరయ్యారు. వీరివద్ద అనేక గంటల పాటు ఈడీ అధికారులు విచారణ జరిపారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం న‌టుడు త‌నీష్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో అనుమానాస్పద లావాదేవీల గురించి అధికారులు ఆరా తీశారు. అలాగే డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలు? ఎఫ్‌ క్లబ్‌లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా? డ్ర‌గ్స్ ఎప్పుడైన తీసుకున్నారా? అనే విష‌యాల‌పై ఆయ‌న‌ను ప్ర‌శ్నించినట్టు సమాచారం. 
 
అయితే విచార‌ణ‌కు వెళ్ల‌బోయే ముందు మీడియాతో మాట్లాడిన తనీష్‌.. త‌న‌కు కెల్విన్ అనే వ్య‌క్తితో ఎలాంటి పరిచ‌యాలు లేవ‌ని చెప్పారు. ఈడీ విచార‌ణ‌కు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments