Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు కోల్పోయిన పవన్ అభిమాన కుటుంబాలకు ఆర్థికసాయం...

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (17:01 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బ్యానర్లు కడుతూ విద్యుదాఘాతానికిగురై ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మెగా ఫ్యామిలీ హీరోలంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంతేనా.. వారికి తమ వంతుగా ఆర్థిక సాయం చేశారు. అలా మొత్తం 12.50 లక్షల చొప్పున ఒక్కో మృతుని కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందనుంది. 
 
ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగింది. బ్యానర్లు కడుతున్న సమయంలో కరెంటు వైర్లు తగిలి రాజేంద్ర, అరుణాచలం, సోమశేఖర్ అనే ముగ్గురు పవన్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో వారి కుటుంబాలపై సానుభూతి పవనాలు వీస్తున్నాయి.
 
ఈ క్రమంలో జనసేన పార్టీ మాత్రమే కాకుండా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, 'వకీల్ సాబ్' చిత్రబృందం, మెగా సూర్య ప్రొడక్షన్స్ కూడా ఆర్థికసాయం ప్రకటించడం జరిగింది. 
 
ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.12.5 లక్షల మేర ఆర్థిక సాయం అందనుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు విరాళం ప్రకటించిన అందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments