ఆస్పత్రిపాలయ్యా.. మీ ఆశీస్సులు కావాలంటూ కమెడియన్ పృథ్వీ-Video

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (21:30 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన కమెడియన్, ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్ అలియాస్ థర్టీ ఇయర్ ఇండస్ట్రీ ఆస్పత్రి పాలయ్యారు. ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ మీ ఆశీస్సులు కావాలంటూ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. 
 
తాను గత కొన్నిరోజులుగా తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, పలుచోట్ల వైద్య పరీక్షలు చేయిచేస్తే కరోనా నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. సీటీ స్కానింగ్ కూడా తీయించానని, అయితే డాక్టర్ల సూచన మేరకు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకుని, సోమవారం అర్థరాత్రి ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు.
 
ప్రస్తుతం అభిమానుల ఆశీర్వాదాలతో పాటు వెంకటేశ్వరస్వామి దీవెనలు తనకుండాలని కోరుకుంటున్నానని, త్వరలోనే ఆరోగ్యవంతుడ్ని కావాలని కోరుకుంటున్నానని పృథ్వీ తన వీడియోలో తెలిపారు. 
 
కాగా, ఏపీ ప్రభుత్వం ఆయన్ను ఎస్వీబీసీ టీవీ చానెల్ ఛైర్మన్‌గా నియమించింది. ఆ తర్వాత ఆ చానెల్‌లో పని చేసే ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించినట్టు ఓ వీడియో లీక్ అయింది. దీనిపై పెద్ద దుమారం చెలరేగడంతో ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించింది. అదేసమయంలో ఆయనకు టాలీవుడ్‌లో సరైన అవకాశాలు లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments