Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ యువ హీరో తండ్రి కరోనాతో మరణం

Webdunia
గురువారం, 9 జులై 2020 (10:33 IST)
కరోనావైరస్ ఎవరిని వదలడం లేదు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి పైన తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. టాలీవుడ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా బారిన పడిన నిర్మాత పోకూరి రామారావు ఇటీవల మృతి చెందారు. తాజాగా టాలీవుడ్ నటుడు ఈ రోజుల్లో ఫేం హీరో శ్రీ తండ్రి మంగం వెంకట దుర్గారాంప్రసాద్ కరోనాతో కన్నుమూసారు.
 
గత 20 రోజులుగా విజయవాడలో ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు. కాగా ప్రముఖ డైరెక్టర్ మారుతి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈరోజుల్లో శ్రీ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.
 
ఆ తర్వాత అతడు లవ్ సైకిల్, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ తదితర సినిమాల్లో నటించాడు. మరోవైపు సినీ పరిశ్రమల్లో కరోనా కలకలం సృష్టిస్తున్న విషయం కూడా తెలిసిందే. అంతేకాకుండా పలువురు టీవీ నటులు కూడా కరోనా బారిన పడ్డారు. టీవీ నటులు రవికృష్ణ, రాజశేఖర్, సాక్షి శివ, రవికృష్ణ, సీరియల్ నటి నవ్య స్వామికి కరోనా సోకిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments